సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వం లో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేష్ బాబు తర్వాత వెంటనే సర్కారు వారి పాట సినిమా మొదలు పెట్టి ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు.
యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.పరశురామ్ బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి గురించి ఈ సినిమాలో చూపించ బోతున్నారని సమాచారం.ఈ సినిమా విడుదల అవ్వకుండానే మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయినా ఈ రెండు సినిమాల్లో మహేష్ లోని మరొక కోణాన్ని బయటకు తీసాడు త్రివిక్రమ్.ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.
ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.ఇప్పడు త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
మరి చూడాలి మహేష్ ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తాడో లేదో.