సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.మరి గత ఏడాది మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
అయితే ఈ సినిమా వచ్చి చాలా నెలలు అవుతున్న కూడా ఇంకా మరో సినిమా షూట్ సగం కూడా పూర్తి చేయలేదు.
మహేష్ పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కారణంగా ఈ సినిమా స్టార్ట్ అయిన కూడా వాయిదా పడుతూ వస్తుంది.
అందుకే మహేష్ బాబు ఈ గ్యాప్ ను పూర్తి చేయాలని గ్యాప్ లేకుండా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది.అసలు విషయం ఏంటంటే.ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో వేసిన ఒక సెట్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం మహేష్ రాత్రి పగలు కష్ట పడుతున్నాడు.అందుకే షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నాడు.ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న కూడా వెంటనే మరో షెడ్యూల్ మొదలు పెట్టినట్టు తాజాగా సమాచారం అందుతుంది.
మహేష్ పట్టుదల చూస్తుంటే ఫాస్ట్ గానే ఈ సినిమా షూట్ పూర్తి చేసేలా కనిపిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.11 ఏళ్ల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుంది.అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.