టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేయాలా అని చూస్తున్నాడు.కాగా ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఎప్పటినుండో మహేష్ ఓ డైరెక్టర్తో సినిమా చేయాలని ఆయన ఫ్యాన్స్ కోరుతూ వస్తున్నారు.
గతంలో మహేష్తో అతడు, ఖలేజా వంటి చిత్రాలను తెరకెక్కించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆ తరువాత మహేష్తో పనిచేయలేదు.దాదాపు దశాబ్ద కాలంగా మహేష్తో ఒక్క సినిమా కూడా చేయలేదు.
దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.అయితే వీరిద్దరు కలిసి కొన్ని యాడ్స్ చేయడంతో మరోసారి వెండితెరపై ఈ కాంబో రావాలని ప్రేక్షకులు కోరుతుండటంతో ఇప్పుడు వారి ఆశలు నెరవేరేలా కనిపిస్తున్నాయి.
ఇటీవల త్రివిక్రమ్ మహేష్ కోసం ఓ స్టోరీలైన్ను రెడీ చేసినట్లు, అది మహేష్కు వినిపించగా ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మహేష్, త్రివిక్రమ్ మరో రెండేళ్ల తరువాత ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరి ఈసారి మహేష్తో త్రివిక్రమ్ ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.ఇక మహేష్ సర్కారు వారి పాట చిత్రంలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.