సూపర్ స్టార్ మహేష్బాబు 27వ చిత్రం గురించి గత మూడు నాలుగు నెలలుగా మీడియలో ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.మొదట ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టి పరశురామ్ దర్శకత్వంలో సినిమాకు మహేష్ రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.ఇప్పటి వరకు మహేష్ 27వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు.రేపు కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మహేష్బాబు 27వ మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.
సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్బాబు మూడు విభిన్న పాత్రల్లో నటించనున్నాడు.మూడు విభిన్నమైన పాత్రలు లేదా మూడు విభిన్నమైన గెటప్స్ లో మహేష్బాబు కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
మహేష్బాబు కోసం రెడీ చేసిన స్క్రిప్ట్కు గాను సర్కార్ వారి పాట అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.ఇదే సమయంలో ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో ఉన్న లొసుగులు మరియు ప్రభుత్వ ఆదాయంకు కొందరు ఎలా గండి కొడుతున్నారు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నారట.
అందుకుగాను మహేష్ బాబు మూడు విభిన్నమైన రోల్స్లో కనిపించబోతున్నాడు అంటున్నారు.