తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు.కాగా ఇటీవలే మహేష్ బాబు హీరోగా నటించిన “సరిలేరు నీకెవ్వరు” చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా షూటింగ్ లేకపోవడంతో మహేష్ బాబు ఇంటి వద్దనే ఉంటూ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు.ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు అందుబాటులో ఉంటున్నాడు.
అయితే తాజాగా మహేష్ బాబు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా చేసినటువంటి ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఇందులో నీటిని సంరక్షించాలని, అంతేగాక ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని కాపాడాలంటూ పిలుపునిచ్చారు.
అలాగే ముందుగా మార్పు మన ఇంటి నుంచే మొదలు కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.దీంతో మహేష్ బాబు చేసినటువంటి ఈ ట్వీట్ ని కొందరు అభిమానులు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ బాగానే ట్రెండింగ్ చేస్తున్నారు.
అంతేగాక మరి కొంతమంది సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ తమ మద్దతును తెలియజేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు మొదలు కావాల్సి ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న కారణంగా కొంతకాలం పాటు ఈ చిత్ర చిత్రీకరణ పనులు వాయిదా వేశారు.