మహేష్ నిజంగా రిస్క్ చేయబోతున్నాడా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Mahesh Babu To Work With New Director, Mahesh Babu, Sarkaru Vaari Paata, New Dir-TeluguStop.com

కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.బ్యాంకింగ్ నేరాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేస్ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనల్ని అలరించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.

కాగా ఈ సినిమా తరువాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరువాత మహేష్ రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

మహేష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కథ బాగా నచ్చడంత మహేష్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.

అయితే ఈ సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడా లేదా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.

ఏదేమైనా మహేష్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తే అది ఖచ్చితంగా రిస్క్ అని ఆయన అభిమానులు అంటున్నారు.

మరి నిజంగానే మహేష్ ఈ రిస్క్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.ఇక సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను మహేష్ తిరగరాయడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube