టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు.బ్యాంకింగ్ నేరాల నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మహేస్ అల్ట్రా స్టైలిష్ లుక్లో మనల్ని అలరించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమా తరువాత మహేష్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే ఈ సినిమా తరువాత మహేష్ రిస్క్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
మహేష్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ సినిమా కథ బాగా నచ్చడంత మహేష్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట.
అయితే ఈ సినిమాలో మహేష్ హీరోగా నటిస్తాడా లేదా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.
ఏదేమైనా మహేష్ ఓ కొత్త దర్శకుడితో సినిమా చేస్తే అది ఖచ్చితంగా రిస్క్ అని ఆయన అభిమానులు అంటున్నారు.
మరి నిజంగానే మహేష్ ఈ రిస్క్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సినీ వర్గాలు.ఇక సర్కారు వారి పాట చిత్రంలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను మహేష్ తిరగరాయడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు.ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.