సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో మహేష్ మరోసారి తనదైన మార్క్ వేసుకుని ప్రేక్షకులను అలరించాడు.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ ఏ సినిమా చేస్తున్నాడనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
దీంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
తమ అభిమాన హీరో సినిమా ఒక్కటి కూడా లైన్లో లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.అయితే తన నెక్ట్స్ మూవీ విషయంలో మహేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.
కాగా తనకు అదిరిపోయే హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరా అని చూస్తున్నాడు.అయితే తనకు హిట్ అందించగల సత్తా ప్రస్తుతం కేవలం త్రివిక్రమ్కు మాత్రమే ఉందని మహేష్ అంటున్నాడు.
అందుకే త్రివిక్రమ్తో కలిసి తన నెక్ట్స్ మూవీని రెడీ చేయాలని చూస్తున్నాడట మహేష్.అయితే త్రివిక్రమ్ మాత్రం ప్రస్తుతం ఎన్టీఆర్తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే లాంఛ్ చేసి ఉన్నాడు.
దీంతో వచ్చే ఏడాది వేసవి వరకు ఆయన ఖాళీగా ఉండరు.దీంతో మహేష్ తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్తో తీయాలనుకుంటే మాత్రం ఇంకో ఏడాది వేచి చూడాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు.