సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలో రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మహేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన హవా సాగించడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.
కాగా ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని కూడా అనౌన్స్ చేశారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ సరికొత్త పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరినీ తీసుకుంటారా అని అందరూ ఆసక్తిగా చూస్తోండగా, శ్రీమంతుడు సినిమాలో మహేష్తో జోడీ కట్టిన శృతి హాసన్ పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.ఆ సినిమాలో మహేష్-శృతి కాంబినేషన్కు మంచి పేరు రావడంతో ఈ సినిమాలో కూడా ఆమెను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అటు శృతి హాసన్ కూడా తన ప్రేమకు బ్రేకులు పడటంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది.ఇప్పటికే రవితేజ-గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో ఆమె నటిస్తోంది.ఇక మహేష్ సినిమా ఆఫర్ను కూడా ఆమె వెంటనే ఓకే చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు చిత్ర యూనిట్.అయితే ఈ విషయానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.
ఒకవేళ ఈ జోడీ మళ్లీ సెట్ అయితే మరో శ్రీమంతుడు లాంటి సెన్సేషన్ రావడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ అంటోన్నారు.