మహేష్ బాబు టైమ్ సరిగా నడవట్లేదు.శ్రీమంతుడు రూపంలో రికార్డులు తన జేబులోనే ఉన్నా, ఎక్కడో అసంతృప్తి.
దానికి కారణం, ఆ సినిమాకి ముందు రెండు డిజాస్టర్లు, సినిమా తరువాత ఒక డిజాస్టర్ ఉండటమే.మరీ ముఖ్యంగా బ్రహ్మోత్సవం ఇచ్చినంత చేదు ఫలితం ఇప్పటివరకు ఏ సినిమా ఇవ్వలేదు.
నటుడిగా కూడా మహేష్ మార్కులు కొట్టలేకపోయాడు.కథ లేకుండా సినిమా ఎలా చేసాడని విమర్శించారు అంతా.
ఇప్పుడు అదే భయంతో, మురుగదాస్ కి మరీ మరీ చెబుతున్నాడట, కథ విషయంలో అంతా పక్కగా చూసుకొమ్మని.షూటింగ్ కి ముందు కూడా మహేష్ – మురుగదాస్, ఇద్దరు కలిసి మళ్ళీ స్క్రిప్టు మీద చర్చించుకుంటారట.
అన్ని పక్కగా కుదిరాకే షూటింగ్ మొదలుపెడదామని మహేష్ అలోచన.
ఎన్వీ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి, రిలయన్స్, లియో ఎంటర్టైన్మెంట్స్, మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సమర్పకులుగా వ్యవహరిస్తారు.
పరిణీతి చోప్రా కథానాయికగా కనిపించబోతోంది.