సూపర్ స్టార్ మహేష్ ఎప్పుడు ఎవరితో సినిమా మొదలుపెడతాడో, ఎప్పుడు సడెన్ గా లిస్టులోకి కొత్త డైరెక్టర్ వచ్చి చేరతాడో అంచనా వేయడం కష్టం.పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ లను కాదని, శ్రీకాంత్ అడ్డాలకి చాన్స్ ఇచ్చిన స్టార్ మహేష్.
అదేరకంగా, అసలు ఎవరు అంచనా వేయకముందే ఏఆర్ మురుగదాస్ తో సినిమా మొదలుపెట్టాడు.ఇక తరువాతి సినిమా కొరటాల శివతో.
మరి ఇంత పెద్ద పేర్ల మధ్య వంశీ పైడిపల్లి వచ్చే చేరడం అంత ఈజీ పని కాదుగా.
పాపం వంశీ, కొన్నేళ్లుగా మహేష్ వెంట తిరుగుతున్నాడు.ఊపిరి విడుదలై చాలాకాలమైనా, ఇంకా మహేష్ అవకాశం ఇస్తాడేమో అని కూర్చున్నాడు.24వ సినిమా తనదే అనుకుంటే కొరటాల శివ వచ్చి చేరాడు.25 నాకే అనుకుంటే ఇప్పుడు త్రివిక్రమ్ పేరు వినిపిస్తోంది.నిజానికి త్రివిక్రమ్ కూడా ఇంకా ఖరారు కాలేదు.
ఇంత పోటి వాతావరణంలో కూడా వంశీ పైడిపల్లి తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.రెగ్యులర్ గా మహేష్ ని కలుస్తూ తనని మర్చిపోకుండా చూసుకుంటున్నాడు.
కాని మహేష్ వేరే సినిమా చూసుకొమ్మని చెప్పేశాడట.సినిమా చేస్తాను కాని, ఇంకా టైమ్ పడుతుంది.
ఇప్పుడు చేసేయొచ్చు అని అనిపిస్తే తానె కబురు పెడతానని చెప్పాడట మహేష్.పాపం వంశీ.