సూపర్ స్టార్ మహేష్ బాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నాడు.అసెంబ్లీలో కూర్చోని విపక్షాల దాడికి ఎదురుదాడి చేయనున్నాడు.
ప్రజల సమస్యలపై పొరాడనున్నాడు.ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలనున్నాడు.
ఏంటి ఇదంతా నిజమే? మరి కేసీఅర్ సంగతి ఏమిటి అనుకుంటున్నారా? మహేష్ బాబు చీఫ్ మనిస్టర్ అయ్యేది నిజమే.కాని రీల్ లైఫ్ లో.అసెంబ్లీలోకి అడుగుపెట్టేది కూడా నిజమే.కాని రియల్ అసెంబ్లీలోకి కాదు, సెట్ లోకి.
ఇదంతా కొరటాల శివ దర్శకత్వంలో రానున్న భరత్ అనే నేను సినిమా కోసం.మహేష్ ఇందులో రాజకీయ నాయకుడిగా, అందులోనూ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న సంగతి మీకు తెలిసిందే.
మురుగదాస్ సినిమా ఆలస్యమవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా లేట్ అయ్యింది.కాని మొత్తానికి భరత్ అనే నేను రెగ్యులర్ షూట్ మొదలు అవుతోంది.
రెండు పాటలు మినహా స్పైడర్ షూటింగ్ మొత్తం పూర్తయ్యింది.మహేష్ మిగిలిన పని పూర్తి చేసుకునే వచ్చేలోపు ఖాలిగా ఉండటం ఎందుకు అని హైదరాబాద్ లో పెద్ద అసెంబ్లీ సెట్ వేస్తున్నారు.
ఒరిజినల్ అసెంబ్లీలో షూటింగ్ కష్టమని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదే నెలలో, అదే అసెంబ్లీ సెట్ మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో భరత్ అనే నేను మొదలుపెడతాడు.
డీవివి దానయ్య నిర్మించబోతున్న ఈ సినిమాలో బాలివుడ్ భామ కైరా అద్వానీ హీరోయిన్ గా కనిపించనుంది.ఇక శరత్ కుమార్ ని మహేష్ తండ్రి పాత్రలోకి ఎంపిక చేసినట్టు సమాచారం.
ఈ పొలిటికల్ యాక్షన్ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు.