టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు ఇటు సినిమాలతో అటు యాడ్స్తో దూసుకు పోతున్నాడు.టాలీవుడ్లో ఎక్కువ యాడ్స్ చేస్తూ, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా మహేష్ నిలుస్తున్నాడు.
ఇక తాజాగా ఈయనతో భవ్య క్రియేషన్స్ అధినేత ప్రసాద్ ఒప్పదం కుదుర్చుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.భవ్య క్రియేషన్స్లో ఒక సినిమాలో నటించడంతో పాటు ఆ సంస్థకు చెందిన భవ్య సిమెంట్కు సంవత్సరం పాటు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించాల్సి ఉంది.
ఈ ఒప్పందం ఖరీదు 20 కోట్లుగా సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా మహేష్బాబు ఒకే సారి రెండు ఆఫర్లు భారీ మొత్తానికి దక్కించుకున్నాడు.
ప్రస్తుతం ఈయన ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటిస్తున్నాడు.వచ్చే నెలలో ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవ్వబోతుంది.
ఆ వెంటనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి నిర్మించనున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్నాడు.ఆ సినిమా తర్వాత భవ్య క్రియేషన్స్లో నటించే అవకాశాలున్నాయని అంటున్నారు.
భవ్య క్రియేషన్స్ చివరి చిత్రం ‘లౌక్యం’ సూపర్ హిట్ అయ్యింది.మళ్లీ వచ్చే సంవత్సరం భవ్య క్రియేషన్స్ అధినేత మహేష్తో సినిమా చేయబోతున్నారు.