టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాుట ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమా తరువాత మహేష్ ఎవరితో సినిమా చేస్తాడా అనే ఆసక్తి సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా నెలకొంది.
కాగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో మహేష్ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి గతంలో రాజమౌళి స్వయంగా వెల్లడించాడు.
ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.అయితే ఈ సినిమా కోసం జక్కన్న చాలా సమయం తీసుకోనుండటంతో, మహేష్ ఈ గ్యాప్లో మరో సినిమా చేయాలని చూస్తున్నాడు.
దీంతో మహేష్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తే బాగుంటుందనే వాదన గట్టిగా వినిపిస్తోంది.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను మెప్పించగా, ఇప్పుడు మరో చిత్రంతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టాలని అభిమానులు కోరుతున్నారు.
అటు త్రివిక్రమ్ కూడా తారక్తో తన నెక్ట్స్ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని, ఆ తరువాత వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.ఈ క్రమంలో త్రివిక్రమ్తో మహేష్ సినిమా చేస్తే అది ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎలాంటి స్క్రిప్టును రెడీ చేస్తాడా, అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.ఇక ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తుండగా, ఈ సినిమాలో మహేష్ సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది.