సూపర్ స్టార్ మహేష్ బాబు .దక్షిణాదిలో అత్యధిక సంపాదన కలిగిన నటుడు.
ఇటు సినిమాలు, అటు దాదాపు 15 కంపెనీల యాడ్ లు.బ్రాండ్ వాల్యూలో మాత్రం మహేష్ దరిదాపుల్లో కూడా ఏ దక్షిణాది హీరో లేడు.అంత సంపాదన దేనికోసం అని తిట్టుకోకండి .ఎందుకంటే అందులో 30% శాతం పేద పిల్లల కోసం ఖర్చుపెడతాడు మహేష్.ఇక మిగిలిన 70% శాతంతో హైదరాబాద్ లో మంచి ఆస్తులే పోగేశాడు మహేష్.
హైదరాబాద్ తరువాత మహేష్ కన్ను దుబాయ్ మీడ పడిందనే ఊహాగానలు విపిస్తున్నాయి.దుబాయ్ లో ఒక ఐలాండ్ కొనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నట్లు పెద్ద టాక్ నడుస్తోంది.ఇంతకి దుబాయ్ లో ఐలాండ్ ఎందుకనేగా మీ డౌటు.
మీకు తెలిసిందేగా, ఏమాత్రం ఖాలి సమయం దొరికినా, కుటుంబాన్ని తీసుకోని విదేశాలకి వెళ్ళడం మహేష్ కి అలవాటు.అయితే మన సూపర్ స్టార్ కి ఉన్న పాపులారిటి వల్ల వేరే దేశాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయట.
విశ్రాంతి సమయంలో కూడా అభిమానుల తాకిడి ఉంటే ఏ హీరోకైనా కష్టమే కదా.అందుకే దుబాయ్ లో ఒక ఐలాండ్ కొనాలని అలోచిస్తున్నాడట మహేష్.
ఆ ఐలాండ్ కి చేరాలంటే పర్సనల్ హెలికాప్టర్ లో వెళ్ళాలంట.దీన్ని బట్టే అర్థం అయ్యుండాలి అక్కడికి మాములు జనాలు వెళ్ళడం ఎంత కష్టమో.సెలవుల్లో అలా దుబాయ్ కి వెళ్ళి, తన సోంత ఐలాండ్ లో , తానూ, తన కుటుంబం మాత్రమే ఎంజాయ్ చేయలనేది సూపర్ స్టార్ ప్లాన్ గా కనిపిస్తోంది.