ప్రెసెంట్ మన తెలుగు బుల్లితెరపై మంచి టిఆర్పి తో నడుస్తున్న గ్రాండ్ రియాలిటీ షో లు రెండు ఉన్నాయి.అందులో ఒకటి తారక్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు, మరొకటి నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 5.
ఈ రెండు షో నిర్వాహకులు పోటాపోటీగా వాళ్ళ షోలను నడిపిస్తున్నారు.ఎవరికీ వారు క్రేజీ స్టార్ లను తీసుకువచ్చి తమ టిఆర్పి రేట్ ను పెంచుకోవాలని చూస్తున్నారు.
ఎన్టీఆర్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కు ఇప్పటి వరకు చాలా మంది గెస్ట్ లు వచ్చారు.రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల ఇలా చాలా మంది గెస్ట్ లను తారక్ తన షో కు ఇన్వైట్ చేసాడు.
అయితే తాజాగా మరొక క్రేజీ స్టార్ తో తారక్ హాట్ సీట్ లో కూర్చుని గేమ్ ఆడించబోతున్నాడని సమాచారం.ప్రెసెంట్ మెల్లగా టీఆర్పీ ను పెంచుకుంటూ పోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో ఈ గెస్ట్ తో టాప్ లో ఉండడం ఖాయం అని అంతా అంటున్నారు.
ఇంతకీ ఈ షో లో గెస్ట్ గా ఎవరు రాబోతున్నారని ఆలోచిస్తున్నారా.తారక్ ఈ షో లో గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబును తీసుకు రాబోతున్నాడని సమాచారం.వీరిద్దరూ కలిస్తే ఇక టీఆర్పీ మీటర్ పగిలిపోవడం ఖాయం అంటున్నారు.ప్రెసెంట్ మహేష్ సర్కారు వారి పాట సినిమాను పూర్తి చేస్తున్నాడు.ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి మహేష్ ఈ గేమ్ ఆడబోతున్నట్టు టాక్.
మరి ఇదే కనుక నిజమైతే ఇక చెప్పాల్సిన పనిలేదు.ఈ షో టాప్ లో నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్ సినిమా పూర్తి చేసి విడుదలకు సిద్ధంగా ఉంచాడు.
ఇక త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను స్టార్ట్ చెయ్యాలని అనుకుంటున్నాడు.ఇక ఈ రెండు సినిమాలతో తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారడం ఖాయం.