టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కువ కష్టపడితే విజయం మనదే అంటూ ట్వీట్ చేసారు.ఇంతకీ ఈ ట్వీట్ ఎవరి కోసం అంటే తన మేనల్లుడు అశోక్ కోసం.
మహేష్ మేనల్లుడు ఏంటి అని అనుకుంటున్నారా.మహేష్ బావగారు గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ వెండి తెరపై తెరంగ్రేటం చేయనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ రోజు మూవీ లాంచ్ చేశారు.ఈ మూవీ లాంచ్ కు కొద్దీ గంటల ముందు బెస్ట్ విషెస్ తెలుపుతూ మహేష్ ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇచ్చారు.
షూట్ తొలిరోజు ఎక్కువ కష్టపడితే విజయం మనదే అవుతుంది, చిత్ర బృందం అందరికీ కూడా నా శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో గల్లా అశోక్ తన డెబ్యూ మూవీ చేయబోతున్నాడు.
ఈ మూవీ లో అశోక్ సరసం నిధి అగర్వాల్ జోడి గా నటిస్తుండగా, సంగీతం గిబ్రాన్ అందిస్తున్నాడు.అలానే ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు పద్మావతి గల్లా నిర్వహిస్తున్నారు.
ఈ రోజు ప్రారంభం కానున్న ఈ చిత్ర లాంచింగ్ కోసం పలువురు ప్రముఖులు రానున్నట్లు తెలుస్తుంది.వారి లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి లు ఉన్నట్లు సమాచారం.మరి ఈ చిత్రం పట్టాలెక్కి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో వేచి చూడాలి.