సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయ సక్సెస్ అందుకున్నాడు.ఈ సినిమాను పూర్తి మాస్ ఎంటర్టైనర్గా దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమా తరువాత మహేష్ తన నెక్ట్స్ మూవీని తొలుత వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
కానీ వంశీతో మహేష్కు విభేదాలు రావడంతో తన నెక్ట్స్ మూవీని గీతా గోవిందం దర్శకుడు పరశురామ్తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమాను లాక్డౌన్ తరువాత ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.కాగా మహేష్ ఈ ఏడాదిలో మరో రెండు సినిమాలు ఎట్టిపరిస్థితుల్లో చేయాలని ఫిక్స్ అయ్యాడట.
దీని కోసం వంశీ పైడిపల్లిని తన స్క్రిప్టును మళ్లీ పూర్తి చేసి పట్టుకురావాలని తెలిపాడట.
దీంతో వంశీ కూడా వెంటనే మహేష్ను ఒప్పించే పనిలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి మహేష్ కథ మళ్లీ మొదటికొచ్చిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలో పరశురామ్ సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తాడా అని మహేష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.