గత కొంతకాలం నుంచి వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు మహేష్ బాబు.
కాగా ఐదుగురు స్ట్రాంగ్ డైరెక్టర్లను లైన్ లో పెట్టేసి ఇక గట్టిగా ప్లాన్ చేసుకున్నాడు అనేది మాత్రం అర్థం అవుతుంది.
ఇక ఒక్కో సినిమాకి ఒక్క రేంజ్ లో అభిమానులకు గూస్బంప్స్ తప్పించబోతున్నాడు అన్నది తెలుస్తోంది.
ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఫిక్స్ చేసేసాడు మహేష్ బాబు.ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ ని ప్లాన్ చేస్తుండగా మరికొన్ని రోజుల్లో పట్టాలెక్కపోతుంది.త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన వెంటనే ధీరుడు రాజమౌళి తో సినిమాలకు రెడీ అయ్యాడు సూపర్ స్టార్ మహేష్.
ఈ సినిమా పై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.
రాజమౌళి సినిమా పూర్తయ్యేలోగా టాలీవుడ్ లెక్కల మాస్టారు సుక్కు కూడా పుష్ప 2 పూర్తి చేసిచేస్తాడు.
దీంతో సుకుమార్ తో క్రేజీ ప్రాజెక్టు ను పట్టా లెక్కించేందుకు మహేష్ బాబు సిద్ధమయ్యాడు అన్నది తెలుస్తుంది.ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత అర్జున్ రెడ్డి తో సెన్సేషన్ సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తో సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్ బాబు.ఇక ఈ లోగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పీరిట్ సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ డేట్స్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్టార్ డైరెక్టర్ పూరి కి మరోసారి ఛాన్స్ ఇచ్చాడట మహేష్ బాబు.ఇప్పటికే వీరి కాంబినేషన్లో పోకిరి, బిజినెస్ మాన్ హిట్లు ఉన్నాయి.దీంతో వీరి కాంబినేషన్ పై కూడా అంచనాలు ఒక రేంజిలో పెరిగిపోతున్నాయి.
ఇలా పక్కా ప్లానింగ్తో ఐదుగురు స్ట్రాంగ్ డైరెక్టర్లను లైన్ లో పెట్టేసాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.