సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తుండటంతో సర్కారు వారి పాట ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్లో మనకు కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే ఈ సినిమా ఇంకా పూర్తిగాక ముందే మహేష్ తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశారు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ ఎప్పటినుండో ఓ సినిమా చేయాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుతున్నారు.గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మాత్రం యావరేజ్ మూవీలుగా నిలిచాయి.దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు.
కాగా ఈ కాంబోలో రాబోయే హ్యా్ట్రిక్ చిత్రం ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్గా మారింది.అయితే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ చాలా పకడ్బందీగా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్, దర్శకుడు త్రివిక్రమ్ అఫీషియల్గా ట్వీట్ చేసినా, మహేష్ మాత్రం ఎలాంటి ట్వీట్ చేయలేదు.దీంతో ఈ సినిమాపై మహేష్ మౌనం దేనికో అని అందరూ ఆలోచిస్తున్నారు.
ఏదేమైనా త్రివిక్రమ్తో హ్యాట్రిక్ చిత్రం చేస్తున్న మహేష్, ఈ సినిమాతో ఎలాంటి బ్లాక్బస్టర్ అందుకుంటాడో చూడాలి.ఇక ఈ సినిమాలో మహేష్ సరసన హీరోయిన్గా ఎవరు చేస్తారనే విషయంపై ఇప్పటికే సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది.