సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన రోజు నుంచి వివాదాలకు దూరంగా ఉన్నారు.తన గురించి, తన సినిమాల గురించి నెగిటివ్ కామెంట్లు వచ్చినా మహేష్ బాబు వాటిని పెద్దగా పట్టించుకోరనే సంగతి తెలిసిందే.
ఇతర హీరోల సినిమాలకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ఇతర హీరోల సినిమాల గురించి మహేష్ బాబు సోషల్ మీడియాలో పాజిటివ్ గా పోస్టులు పెడతారు.
ఈ మధ్య కాలంలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చాలా సినిమాలపై సోషల్ మీడియా ద్వారా మహేష్ బాబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
అయితే మహేష్ హీరోగా నటించి విడుదలైన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా టాలీవుడ్ లోని ఏ స్టార్ హీరో ఈ సినిమా గురించి పెద్దగా రియాక్ట్ కాలేదు.ప్రభాస్ ఈ సినిమా చూసి ప్రశంసించారని వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన రాలేదు.
టాలీవుడ్ స్టార్స్ ఈ విధంగా చేయడం మహేష్ బాబును హర్ట్ చేసిందని తెలుస్తోంది.ఇతర హీరోల విషయంలో ఎంత మంచిగా వ్యవహరిస్తున్నా హిట్ సినిమా గురించి పాజిటివ్ గా కామెంట్ కూడా చేయకపోవడం ఏమిటని మహేష్ బాబు తెగ ఫీలవుతున్నారని సమాచారం.ఇకపై ఇతర హీరోల సినిమాలు విడుదలై హిట్టైనా మహేష్ పాజిటివ్ గా ట్వీట్లు వేయకపోవచ్చని, పాజిటివ్ గా కామెంట్లు చేయకపోవచ్చని తెలుస్తోంది.ఇతర హీరోల ప్రవర్తన మహేష్ బాబును ఎంతగానో బాధ పెట్టిందని సమాచారం అందుతోంది.
తాజాగా కర్నూలులో సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రేషన్స్ జరగగా ఈ వేడుకకు రికార్డు స్థాయిలో ఫ్యాన్స్ హాజరయ్యారు.మహేష్ బాబు స్టేజ్ పై డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను అలరించారు.
ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే దిశగా మహేష్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.