టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదలుకానుంది.త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి రాజమౌళి ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు రాజమౌళికి షాకిచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాకు టాలీవుడ్ హీరోయిన్లను దూరం పెట్టిన రాజమౌళి బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇచ్చారు.మహేష్ రాజమౌళి కాంబో మూవీలో కూడా బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే తనకు బాలీవుడ్ హీరోయిన్లు అచ్చిరాలేదని టాలీవుడ్ హీరోయిన్లకే ప్రాధాన్యత ఇవ్వాలని రాజమౌళికి మహేష్ సూచనలు చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయనే సంగతి తెలిసిందే.మహేష్ జక్కన్న కాంబో మూవీ 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని వార్తలు వస్తున్నాయి.
కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది.
మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి అధికారికంగా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు.మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వస్తుందేమో చూడాల్సి ఉంది.రాజమౌళి డైరెక్షన్ లో నటించడానికి మహేష్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
సినిమాసినిమాకు మహేష్ బాబుకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.మహేష్ కు జోడీగా నటించే ఛాన్స్ అంటే ఏ హీరోయిన్ కూడా నో చెప్పే అవకాశం అయితే ఉండదు.