సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య కాలంలో వరుస సక్సెస్ లను అందుకుంటూ సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఒక ఇంటర్వ్యూలో మహేష్ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రావాలా సినిమాకు నేషనల్ అవార్డ్ వస్తుందని భావిస్తే రాలేదని తెలిపారు.అప్పటినుంచి నాకు అవార్డులపై నమ్మకం పోయిందని ఆయన అన్నారు.
తాను మూడురోజుల పాటు స్లమ్ లో ఉండి ఆంధ్రావాలా సెట్ వేశానని ఆయన తెలిపారు.ఆ సెట్ ను చూసి ఒక పొలిటీషియన్ ఆశ్చర్యపోయారని ఆయన చెప్పుకొచ్చారు.
సినిమా ఫ్లాప్ కావడంతో ఆ సినిమాను అవార్డు కమిటీ చూడలేదని ఆయన చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తాను హర్ట్ అయ్యానని తెలిపారు.
అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా కోసం సముద్రం పక్కన సెట్ వేశానని ఆయన చెప్పుకొచ్చారు.
మా విభాగంలో వేరేవాళ్లకు అవార్డులు వస్తున్నాయని కానీ కష్టపడి పని చేసిన వాళ్ల కష్టాలను కూడా అర్థం చేసుకోవాలని చిన్నా అన్నారు.
రియలిస్టిక్ గా సెట్ వేయడం చూసిన మహేష్ మరీ న్యాచురల్ గా సెట్ ఉందని ఈ సెట్ ను గుర్తించి అవార్డు ఎవరు ఇస్తారని అన్నారని చిన్నా తెలిపారు.పీరియాడికల్ సెట్స్ వేశామని కానీ తగిన గుర్తింపు దక్కడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.అధినాయకుడు సినిమా కోసం పని చేసినా సినిమా ఫ్లాప్ కావడంతో తగిన గుర్తింపు దక్కలేదని ఆయన చెప్పుకొచ్చారు.
తన గురించి ప్రచారంలోకి వచ్చిన వార్తల గురించి చిన్నా స్పందిస్తూ మీడియాలో ఒక కేసు విషయంలో తన గురించి ప్రచారం జరిగిందని ఆయన అన్నారు.తనకు సిగరెట్, మందు అలవాటు లేదని అయినప్పటికీ తన గురించి తప్పుగా ప్రచారం జరిగిందని చిన్నా పేర్కొన్నారు.చిన్నా చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.