టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రోజురోజుకూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతున్నారు.ఇప్పటి వరకు మహేష్ పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా తనకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఆయన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ కంపెనీలు సైతం మహేష్ బాబును తమ యాడ్స్ లో నటించేందుకు సంప్రదిస్తుంటారు.టాలీవుడ్ లో మరే హీరో చేయనన్ని యాడ్స్ ఒక్క మహేష్ బాబు చేస్తున్నాడు.
తన దగ్గరకు వచ్చిన ఏ యాడ్ ను వదిలి పెట్టకుండా చేసుకుంటూ పోతాడు మహేష్.తాజాగా మరొక కమర్షియల్ యాడ్ లో మహేష్ బాబు నటిస్తున్నాడని సమాచారం.
అంతేకాదు ఈ యాడ్ లో మరొక స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడని తెలుస్తుంది.బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ తో కలిసి మహేష్ స్క్రీన్ పంచుకోబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.
మౌత్ ఫ్రెష్నర్ యాడ్ లో ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించారని సమాచారం.ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుందట.
మరి బుల్లితెరపై త్వరలోనే ఈ యాడ్ ప్రసారం కాబోతుంది.ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించారు కాబట్టి ఈ యాడ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు.ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.చాలా రోజుల తర్వాత మహేష్ లవర్ బాయ్ పాత్రలో కనిపిస్తున్నాడు.
అంతేకాదు టీజర్ లో మహేష్ మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.2022 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.