సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సీరియస్ అయిపోయాడు.యూనిట్ మెంబర్లందరికి ఆర్డర్ వేసేశాడు.
తన మాట వినకపోతే అంతే సంగతులు .బ్రహ్మోత్సవం యూనిట్ లో అందరికి మహేష్ భయం పట్టేసుకుంది.ఇకనుంచైనా ఒళ్ళు దగ్గరపెట్టుకొని పనిచేస్తారేమో చూడాలి.ఇంతకీ మహేష్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఏంటనే కదా మీ డౌటు.
బ్రహ్మోత్సవం యూనిట్ నత్తనడకన సాగుతోంది.ఒక్క షెడ్యూలు కూడా అనుకున్న సమయానికి పూర్తవట్లేదు.
ఏప్రిల్ నుంచి మే నెలకి సినిమా వాయిదా పడిందని ఇప్పటికే పంపిణిదారులకి సంకేతాలు వెళ్ళాయి.కొంతమంది అయితే సినిమా జూన్ కి కూడా వెళ్ళొచ్చని ప్రచారం చేస్తున్నారు.
ఇలా యూనిట్ బద్దకం బయటకి తెలియడంతో మహేష్ బాబు బాగా సీరియస్ అయినట్టు సమాచారం.
సినిమాని సినిమాల తీయండి.
ఇంకెన్ని రోజులు తీస్తారు .అందరు ఒళ్ళు దగ్గర పెట్టుకోని పనిచేయండి.ఏప్రిల్ 29నే విడుదలకి సిద్ధమవ్వాలి.ఇంకా ఆలస్యం చేస్తే బాగుండదు .అంటూ మహేష్ గట్టిగా లెక్చర్ తీసుకున్నట్లు సమాచారం.
మరి మహేష్ తీసుకున్న క్లాస్ ఎంతవరకు పనికొస్తుందో!
.