టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిమానులకు దగ్గరగా ఉండే ఫ్యామిలీ మహేష్ బాబు ఫ్యామిలీ అనే చెప్పవచ్చు.అంతేకాకుండా మహేష్ బాబు కూడా తన ఫ్యామిలీ కోసం ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు.
అంతేకాకుండా షూటింగ్ విరామ సమయంలో ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తుంటాడు.అంతేకాకుండా తన ఫ్యామిలీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
మహేష్ బాబు భార్య నమ్రత ఎప్పటికప్పుడు తమ పిల్లలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది.అంతే కాకుండా మహేష్ బాబు కూతురు సితార కూడా ఫాలోవర్స్ తో బాగా దగ్గరగా ఉంటుంది.
ఇక తన కొడుకు గౌతమ్ కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.ఇదిలా ఉంటే ప్రస్తుతం పరిస్థితులు బాగా లేనందున తన కుటుంబం కోసం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నాడు.
ఇంట్లోకి ఎవరు రాకుండా పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేశాడట.ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా బయటకు వెళ్ళకుండా తన ఇంట్లోనే ఏర్పాట్లు చేశాడట.కేవలం ఇంటా.బయట అవసరాలకు మాత్రమే ఒక వ్యక్తిని పెట్టాడట.అతను కూడా కేవలం ఇంటి ముందు వరకు రావడానికి మాత్రమే అనుమతి ఇచ్చారట.మహేష్ బాబు కేవలం ఒక సినిమాల్లోనే కాకుండా.
బయట బిజినెస్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉంటాడు.ఇక పర్సనల్ పని కోసం మహేష్ బాబు ని కలవడానికి ఎంతోమంది వస్తుంటారు.
వెళుతుంటారు.అయితే ఇటీవలే మహేష్ బాబుతో కొన్ని విషయాలు పంచుకోవడానికి వచ్చిన వాళ్ళల్లో కరోనా ఉన్నట్లు అనుమానాలు రావడంతో మహేష్ బాబు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.
ఇక షూటింగ్స్ వాయిదా పడటంతో ప్రస్తుత మహేష్ బాబు ఇంట్లోనే ఉంటున్నాడు.