నైజాం నవాబ్‌గా మహేష్‌.. సరిలేరు నీకెవ్వరు అంటోన్న ఫ్యాన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు రిలీజ్ అయ్యి వారం దాటినా సినిమాకు రెస్పాన్స్ మాత్రం తగ్గడం లేదు.పండగ సెలవులు ముగియడంతో ఈ సినిమాకు అసలు పరీక్ష సోమవారం నుండి ఉంటుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

 Mahesh Babu Scores Back To Back 30 Crore Movie In Nizam-TeluguStop.com

అయినా ఇప్పటికే ఈ సినిమా పలు కొత్త రికార్డులను క్రియేట్ చేసి మహేష్ స్టామినా ఏమిటో ఇండస్ట్రీకి మరోసారి రుజువు చేసింది.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా అన్ని ఏరియాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది.

ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.ఈ సినిమా ఇప్పటివరకు ఒక్క నైజాం ఏరియాలోనే రూ.32.1 కోట్లకు పైగా షేర్ కలెక్షన్లు సాధించింది.ఈ సినిమాతో మహేష్ వరుసగా రెండోసారి ఈ ఫీట్ సాధించిన హీరోగా తన సత్తా చాటాడు.గత చత్రం మహర్షితో రూ.30 కోట్ల హయ్యెస్ట్ కలెక్షన్లు రాబట్టిన మహేష్, ఈ సినిమాతో దాన్ని అధిగమించాడు.

కాగా ఈ సినిమా టోటల్ రన్‌లో రూ.35 కోట్ల వసూళ్లు సాధిస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తోంది.అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించగా, అందాల భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube