టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున ఇప్పటికే షూటింగ్స్ మొదలు పెట్టాడు.ఒక వైపు వైల్డ్ డాగ్ మరో వైపు బిగ్ బాస్ లతో నాగ్ బిజీ అయ్యాడు.
ఇక మరో సీనియర్ స్టార్ వెంకటేష్ ‘నారప్ప’ షూటింగ్ కోసం సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అతి త్వరలోనే నారప్ప షూటింగ్ లో వెంకటేష్ జాయిన్ కాబోతున్నాడు.ఇదే సమయంలో బాలకృష్ణ ను అక్టోబర్ నుండి బరిలోకి దించేందుకు బోయపాటి సన్నాహాలు చేస్తున్నాడు.
ఇప్పటికే షూటింగ్ పునః ప్రారంభంకు బోయపాటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఆయన సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.చిరంజీవి మాత్రం కాస్త సమయం తీసుకుని షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
అది ఎప్పుడు అనేది అక్టోబర్ లో తెలిసే అవకాశం ఉందంటున్నారు.
సీనియర్ స్టార్స్ మాత్రమే కాకుండా నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ, నిఖిల్, సందీప్ కిషన్ వంటి యంగ్ స్టర్స్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
కాని మహేష్ బాబు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.ఇప్పటి వరకు మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాటకు సంబంధించి షూటింగ్ విషయమై ఎలాంటి అప్ డేట్ రాకపోవడంపై అభిమానులు అసహనంతో ఉన్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా పూర్తి అయ్యి దాదాపుగా ఎనిమిది తొమ్మిది నెలలు అవుతుంది.అయినా కూడా మహేష్బాబు కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వలేదు.ఈయన ఎందుకు షూటింగ్కు డుమ్మా కొడుతున్నాడు అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.మొదటి రెండు మూడు నెలల పాటు చాలా మంది స్టార్స్ షూటింగ్స్ కు హాజరు కాలేదు.
ఇప్పుడు హాజరు అవుతున్నారు కనుక మహేష్ బాబు కూడా షూటింగ్ లో హాజరు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ లో పాల్గొనడం వల్ల ప్రమాదం లేదని ఇప్పటికే ప్రభుత్వాలు స్వయంగా ప్రకటించాయి.
కార్మికుల కోసం అయినా షూటింగ్ లో పాల్గొనాలంటూ చాలా మంది కోరుతున్నారు.కాని మహేష్ బాబు మాత్రం ఆ విషయంలో పెద్దగా ఆసక్తి చూపుతున్నట్లుగా కనిపించడం లేదు.
పరశురామ్ దర్శకత్వంలో రూపొందబోతున్న సర్కారు వారి పాట చిత్రం షూటింగ్ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.చాలా నెలల గ్యాప్ తర్వాత ఒక యాడ్ షూట్ కోసం మహేష్ బాబు కెమెరా ముందుకు వచ్చాడు.
కనుక ఖచ్చితంగా త్వరలోనే సర్కారు వారి పాటను మహేష్ బాబు పట్టాలెక్కిస్తాడనే నమ్మకంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.