సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ ను ఇటీవల విడుదల చేశారు.మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సర్కారు వారి పాట టీజర్ ను 50 మిలియన్ ల వ్యూస్ వరకు తీసుకు వెళ్లాలని అభిమానులు చాలా కృషి చేశారు.
కాని ఇప్పటి వరకు టీజర్ 30 మిలియన్ ల వరకు వ్యూస్ ను దక్కించుకుంది.టీజర్ కు సంబంధించినంత వరకు అద్బుతమైన విజువల్స్ ఉండటంతో అభిమానులు మళ్లీ మళ్లీ చూడటంతో భారీగానే వ్యూస్ వచ్చాయి.
ముందు ముందు కూడా ఈ టీజర్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది కనుక మరో వారం పది రోజుల్లో మరో 10 మిలియన్ ల వ్యూస్ వరకు వస్తాయి.అంటే 40 మిలియన్ ల వ్యూస్ వరకు ఈ టీజర్ వెళ్తుంది అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
మహేష్ బాబు నుండి మొదలుకుని హీరోయిన్ కీర్తి సురేష్ మరియు కమెడియన్ వెన్నెల కిషోర్ ప్రతి ఒక్కరికి సంబంధించిన షాట్స్ సినిమా టీజర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.రికార్డు బ్రేకింగ్ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తో మహేష్ బాబు కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో ముగించబోతున్నారు.సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే అధికారికంగా విడుదల తేదీని కూడా ప్రకటించారు.పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా టీజర్ నుండి మొదలుకుని పాటల వరకు థమన్ మార్క్ తో దుమ్ము రేపేస్తుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందు థమన్ మరింతగా రచ్చ చేయడం ఖాయం అంటున్నారు.