మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ సంక్రాంతికి వస్తుందని గత ఏడాది నుండి ఎదురు చూశారు.కాని సంక్రాంతికి సినిమా విడుదల అవ్వలేదు.
సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అవ్వడానికి కనీసం రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.కనుక సినిమా విడుదల ఏప్రిల్ లో విడుదల అవుతుందని అంతా భావించారు.
కాని అనూహ్యంగా సినిమా విడుదలకు మళ్లీ అడ్డంకి వచ్చింది.మహేష్ బాబు కరోనా బారిన పడటం మరియు ఆయన సోదరుడు రమేష్ బాబు చనిపోవడం ఇలా పలు కారణాల వల్ల సినిమా వాయిదా పడింది.
ఏప్రిల్ బరి నుండి తప్పుకున్న సర్కారు వారి పాట వచ్చేది ఎప్పుడు అనే విషయం ఎప్పుడు తెలుస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సమయంలో సినిమా కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్దం అయ్యారు.
సంక్రాంతికి అప్డేట్ ఇవ్వలేక పోయినందుకు క్షమించాలి అంటూ మేకర్స్ ఇటీవలే ప్రకటన విడుదల చేయడం జరిగింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మే నెలలో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఆ విషయాన్ని అతి త్వరలోనే ప్రకటించబోతున్నారు.
అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా విడుదల తేదీని రిపబ్లిక్ డే సందర్బంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.మొత్తానికి సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉన్న అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.థమన్ అందించిన పాటలు సినిమాకు ప్రథాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
సర్కారు వారి పాట చిత్రీకరణ కోసం మహేష్ బాబు త్వరలోనే మళ్లీ దుబాయి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.కీర్తి సురేష్ మరియు మహేష్ ల కాంబో సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయని అంటున్నారు.
విడుదల తేదీ మే నెలలో ఫిక్స్ చేస్తే అభిమానులు అంతా కూడా హ్యాపీ.