సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
వసూళ్ల పరంగానే కాకుండా శాటిలైట్ రేటింగ్ పరంగా కూడా మంచి రికార్డును సొంతం చేసుకుంది.ఆ సినిమా తర్వాత మహేష్బాబు చేయబోతున్న సినిమా సర్కారు వారి పాట.
ఈ సినిమా షూటింగ్ విషయంలో ఫ్యాన్స్ ను కొందరు గందరగోళంకు గురి చేస్తున్నారు.ఈ ఏడాది చివరి నుండి షూటింగ్ను ప్రారంభించబోతున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత ఇప్పుడు షూటింగ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు అంటున్నారు.ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఇండియాలో కాదు అమెరికాలో అనే విషయం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.
కాని ఈ ఏడాదిలోనే అది కూడా నవంబర్లోనే అమెరికాకు యూనిట్ సభ్యులు ప్రయాణం అవుతున్నారు అన్నది మాత్రం నిజం కాదని క్లారిటీ వచ్చేసింది. మహేష్బాబు సన్నిహితులు ఈ విషయమై స్పందిస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా వెళ్లడం కాస్త కష్టమైన పనే.అక్కడ కేసుల సంఖ్య ఇండియాలో కంటే ఎక్కువగా ఉన్నాయి.కనుక ఇండియాతో పాటు అమెరికా కూడా అత్యంత ప్రమాదకరమైన దేశమే.
కనుక కాస్త ఆలస్యంగానే సర్కారు వారి పాట మొదలు పెట్టాలని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు.పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా బ్యాంకింగ్ రంగంలో ఉన్న అవినీతి మరియు ఇతరత్ర విషయాలపై పోరాట సన్నివేశాలను కలిగి ఉంటుంది.
ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో ప్రారంభించి చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.
గీత గోవిందం తర్వాత పరశురామ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.