సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రారంభం అయ్యింది.సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ అయితే ప్రారంభం అయ్యింది.కాని సినిమా ఎప్పుడ జరుగుతుంది.
ఎవరు ఎవరు షూటింగ్ లో పాల్గొంటున్నారు అనే విషయంలో స్పష్టత కరువు అయ్యింది.పెద్ద ఎత్తున సినిమా కోసం బడ్జెట్ ను ఖచ్చు చేస్తున్న చిత్ర యూనిట్ సభ్యులు రికార్డు స్థాయి వసూళ్లను ఆశిస్తున్నారు.
అందుకే సినిమా ను మొదటి షెడ్యూల్ దుబాయిలో ప్లాన్ చేశారు.అందుకే సినిమా చిత్రకీరణ కోసం కాస్త ఎక్కువే ఖర్చు అవుతున్నా నిర్మాతలు మాత్రం వెనక్కు తగ్గడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ఓ రేంజ్ లో హిట్ అవ్వడం ఖాయం అంటూ ఇప్పటికే అభిమానులు ఓ రేంజ్ లో ఆశ పెట్టుకుని ఉన్నారు.సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా సర్కారు వారి పాట పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి.
ఆ అంచనాలను అందుకోవాలంటే కాస్త కష్టమే అయినా కూడా సినిమా ను ఓ రేంజ్ ఓ విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లుగా దర్శకుడు పరశురామ్ చెబుతున్నాడు.బ్యాంకింగ్ రంగంలో నెల కొన్ని పరిస్థితుల నేపథ్యంలో సినిమా రూపొందుతుందట.అవినీతి మరియు అక్రమాలను చూపించబోతున్నారు.మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తున్న కారణంగా అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ క్రేజ్ బాగా పెరిగి పోయింది.మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా లేదా అనేది చూడాలి.