సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ మొదలు అయ్యింది.అక్కడ ఇక్కడ అంటూ ఎక్కడెక్కడో ప్రచారం జరిగింది.
చివరకు సినిమా షూటింగ్ ను సింపుల్ గా భారీ హడావుడి లేకుండా చేసేశారు.సినిమా చిత్రీకరణ రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్లుగా మేము నిన్న ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది.
మాకు అందిన సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ నేటి నుండి ప్రారంభం అయ్యింది.ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
సినిమా చిత్రీకరణ మొదలు పెట్టినట్లుగా షూటింగ్ అప్ డేట్ ను మైత్రి మూవీ మేకర్స్ ఒక చిన్న వీడియో బిట్ ను విడుదల చేసి మరీ ప్రకటించారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేసే అవకాశం ఉందంటున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఏ సినిమా అయినా హడావుడిగా కాకుండా తాపిగా ఫస్ట్ లుక్ ఇతర లుక్ లను విడుదల చేయరు.అన్ని అనుకున్నట్లుగా విడుదల చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు.
తాజాగా మహేష్ బాబు నుండి అప్ డేట్ రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఉండగా దర్శకుడు పరశురామ్ గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.
కనుక ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అంటే ఖచ్చితంగా అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.బ్యాంక్ లు అవినీతిపై ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే కాన్సెప్ట్ ను ప్రకటించారు.దాంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా వస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
.