సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కు థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈయన గత చిత్రం అల వైకుంఠ పురంలో సినిమా సూపర్ హిట్ అయన విషయం తెల్సిందే.
ఆ సినిమా తర్వాత సర్కారు వారి పాట సినిమాకు గాను థమన్ వర్క్ చేస్తున్నాడు కనుక భారీగా అంచనాలు ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా థమన్ ఈ సినిమాకు పాటలు రూపొందిస్తున్నాడు.
మొదటి పాటను మహేష్ బాబు బర్త్ డే సందర్బంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఇక ఇటీవలే పుష్ప సినిమా ఆడియో ను ప్రముఖ ఆడియో సంస్థ ఏకంగా 4.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.దేవి శ్రీ ప్రసాద్ ఈమద్య కాలంలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాడు.
థమన్ తో గత ఏడాది పోటీ పడి వెనుక పడ్డాడు.అల వైకుంఠపురంలో మరియు సరిలేరు నీకెవ్వరు సినిమాలు పోటీ పడ్డ సమయంలో అల వైకుంఠపురంలో సినిమా టాప్ గా నిలిచింది.
ఇప్పుడు పుష్ప సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ ప్రాణం పెట్టి మరీ చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.అందుకే పుష్ప సినిమా ఆడియో గురించి గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్నాయి.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్ విషయంలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ సమయంలోనే సర్కారు వారి పాట సినిమా ఆడియో రైట్స్ గురించి చర్చ జరుగుతోంది.సర్కారు వారి పాట సినిమా ఆడియో రైట్స్ అయిదు కోట్లకు మించి పలుకుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.అయితే పుష్ప సినిమా ను మించిన రేటు పలికితే మాత్రం అది ఖచ్చితంగా అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.