సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తూన్న విషయం విదితమే.పరశురామ్ పెట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా కోసం అభిమానులంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది అని సంతోష పడ్డారు.కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశారు.
అయితే ఆ తర్వాత కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.మైత్రి మూవీస్ తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.అయితే ఈ సినిమా నుండి అప్డేట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా అప్డేట్ లు ఏమీ ఇవ్వలేక పోతున్నామని అందుకు క్షమాపణలు కూడా కోరారు మేకర్స్.
కనీసం మ్యూజిక్ పరంగా అయినా అప్డేట్ ఇవ్వండి అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు.ఈ క్రమంలోనే ఈ రిపబ్లిక్ డే సందర్భంగా సినిమాకు సంబంధించిన అప్డేట్ రానుందని ఆశగా ఎదురు చూస్తున్నారు.
కానీ ఇప్పుడు కూడా చివరి నిముషంలో చిత్ర యూనిట్ చేతులెత్తేసింది.అయితే నిరాశలో ఉన్న అభిమానులకు తమన్ ఒక ఊరట నిచ్చే సమాచారం తెలిపాడు.
సర్కారు వారి పాట సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అని ఎదురు చూసే మహేష్ అభిమానులకు ఒక చిన్న బిట్ వినిపించి సర్ప్రైజ్ చేసాడు.ఈ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్ ను కొద్దీ సేపు ప్లే చేసి వినిపించాడు.ఈ వీడియో చూసిన అభిమానులకు కాస్త ఊరట లభించింది.ఎందుకంటే త్వరలోనే మహేష్ టైటిల్ సాంగ్ కి సంబంధించిన అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తమన్ ఇండైరెక్ట్ గా తెలిపాడు.
మరి చూడాలి అభిమానుల ఎదురు చుపులు ఎప్పుడు ఫలిస్తాయో.