సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట‘ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ప్రెసెంట్ ఈ షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది.ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.
మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపించ బోతున్నాడు.,/br>
యూరోపియన్ దేశంలో యాక్షన్ సీక్వెన్స్ ను చిత్ర యూనిట్ చిత్రీకరిస్తుంది.
ప్రెసెంట్ ఈ సినిమా రిలీజ్ గురించిన చర్చలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న రిలీజ్ చేయబోతున్నట్టు అందరి కంటే ముందే ప్రకటించాడు.
అయితే ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.
అందుకు కారణం కూడా లేకపోలేదు.ఇటీవలే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను జనవరి 7న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించాడు.ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేష్ సర్కారు వారి పాట, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాలో బరిలో ఉండగా ఇప్పుడు కొత్తగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా రావడంతో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను వాయిదా వేయాలని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
అన్ని సినిమాలు ఒకేసారి వచ్చిన ప్రేక్షకులు అన్నింటిపై ద్రుష్టి పెట్టలేదు.దీంతో ఏదో ఒక సినిమాకు మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తారు.అందుకే చిత్ర యూనిట్ బాగా ఆలోచించి ఈ సినిమాను వాయిదా వేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది.
మొత్తానికి సర్కారు వారి పాట వాయిదా కన్ఫర్మ్ అయ్యేటట్టే ఉంది.ఇక ఆర్ ఆర్ ఆర్ ఎఫెక్ట్ తో మిగతా సినిమాలు కూడా రేస్ లో చివరి వరకు ఉంటాయో లేదో చూడాలి.