సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.వసూళ్ల పరంగా ఈ సినిమా డీసెంట్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది.
అయినా కూడా కొందరు మాత్రం మరీ దారుణంగా సినిమా ఉందంటూ విమర్శలు చేస్తున్నారు.ఆచార్యతో పోల్చితే సినిమా అట్టర్ ప్లాప్ అంటూ వారు విమర్శలు చేస్తున్నారు.
మహేష్ బాబు యాంటీ ఫ్యాన్స్ పని కట్టుకుని మరీ సినిమా ను బ్యాడ్ చేసేలా మాట్లాడుతున్నారు.కొందరు మీమ్స్ చేస్తూ సినిమాకు డ్యామేజీ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమాకు తప్పుడు కలెక్షన్స్ ను చెబుతూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా ఒక సోషల్ మీడియా పోస్ట్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంద్య 70 ఎంఎం లో రెండవ రోజు సర్కారు వారి పాట సినిమా రూ.59677 గ్రాస్ వసూళ్లు చేసింది.అదే థియేటర్ లో రెండవ రోజు కొబ్బరి మట్ట సినిమా 70 వేల రూపాయలకు పైగా వసూళ్లు చేసిందని విమర్శలు చేస్తున్నారు.
సంపూర్నేష్ బాబు సినిమా స్థాయిలో కూడా మహేష్ బాబు సినిమా రాబట్టలేక పోయింది అంటూ చాలా మంది చాలా రకాలుగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను టార్గెట్ చేస్తున్నారు.
మరీ దారుణంగా మహేష్ బాబు సినిమా వసూళ్లు అంత తక్కువ ఉంటాయని ఏ ఒక్కరు భావించడం లేదు.కాని సోషల్ మీడియాలో చేస్తున్న బ్యాడ్ ప్రచారం వల్ల మాత్రం చాలా డ్యామేజీ అయితే జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో సర్కారు వారి పాట టీమ్ మెంబర్స్ ఎంత సీరియస్ గా ప్రచారం చేసినా కూడా నెగటివ్ ప్రచారం ముందుగా జనాల్లోకి వెళ్తోంది.దాంతో సర్కారు వారి పాట వసూళ్ల విషయంలో ప్రభావం పడుతున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.