ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు.బాహుబలి తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యాయి.
అందరు తమ మార్కెట్ విస్తరించుకోవాలని వాళ్ళ సినిమాలను అన్ని ప్రధాన భాషల్లో తెరకెక్కిస్తున్నారు.అయితే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాడు.
ఆయన ప్రస్తుతం నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను పాన్ ఇండియా గా విడుదల చేస్తారేమోనని అభిమానులు అనుకున్నారు.కానీ మహేష్ చేస్తున్న సర్కారు సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు రెడీగా లేరని తెలుస్తుంది.
ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
సర్కారు వారి పాట సినిమాను ఇతర భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ఎక్కడ ప్రకటించలేదు.
అందుకే ఈ సినిమాను కేవలం తెలుగులో మాత్రమే విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.అందుకే పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి సర్కారు వారి పాట మేకర్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని కథనాలు వస్తున్నాయి.ఇది ఇలా ఉండగా ఈ సినిమాను పరశురామ్ దర్శకత్వం చేస్తున్నాడు.
ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించబోతున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా లో విలన్ గా బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ నటిస్తున్నాడు.ఈ సినిమా లో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టగానే కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమా ను వచ్చే సంవత్సరం 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.