ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న మహేష్ బాబు కొత్త సినిమా అనౌన్స్మెంట్ రానే వచ్చేసింది.సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు 27వ చిత్రానికి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని నిన్న చిత్ర యూనిట్ ప్రకటించింది.
చెప్పినట్లుగానే ఈ సినిమా టైటిల్ పోస్టర్తో పాటు మహేష్ లుక్ను రివీల్ చేస్తూ చిత్ర యూనిట్ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది.ఈ సినిమాకు ముందునుండి అనుకున్నట్లుగానే ‘సర్కారు వాటి పాట’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.
ఇక ఈ పోస్టర్లో మహేష్ బాబు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్లో మనకు దర్శనమివ్వబోతున్నాడు.మహేష్ వెనకాల నుండి ఉన్న పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
తన మెడ భాగంపై రూపాయి బిళ్ల టాటూ వేసుకుని ఈ సినిమా కథేమిటో అనే ఆసక్తిని అందరిలో క్రియేట్ చేశాడు మహేష్.ఈ పోస్టర్తో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తమ అభిమాన హీరో సర్ప్రైజ్ అనుకున్నట్లుగానే ఉండటంతో వారు ఈ పోస్టర్ను తెగ షేర్ చేస్తూ వైరల్ చేసే దిశగా వెళ్తున్నారు.
కాగా ఈ సినిమాలో మహేష్ ఎలాంటి పాత్రలో నటిస్తాడో ఇంకా తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ పేరు మరోసారి వినిపిస్తోంది.దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని, తనదైన మార్క్ను మిస్ కాకుండా మహేష్ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ఇక మైత్రీ మూవీ మేకర్స్తో పాటు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాను సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.