మహేష్ సర్కారు వారి పాట ఇప్పట్లో లేనట్లేనా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Mahesh Babu No To Sarkaru Vaari Paata Until December, Mahesh Babu, Sarkaru Vaari-TeluguStop.com

ఇక ఈ సినిమాను లాక్‌డౌన్ తరువాత ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ వారి ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదట.

ప్రస్తుతం నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితుల నుండి బయటపడ్డాకే ఈ సినిమాను ప్రారంభించాలని సూపర్ స్టార్ మహేష్ అనుకున్నాడు.కాగా ఇప్పుడు ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుండటంతో ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం లాక్‌డౌన్‌కు పెద్ద ఎత్తున సడలింపులు ఇవ్వడంతో కరోనా వైరస్ విజృంభిస్తోంది.రోజురోజుకు కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతుండటంతో చిత్రాన్ని మొదలుపెట్టేందుకు మహేష్ అనాసక్తిగా ఉన్నాడట.

తొలుత ఆగస్టులో ఈ సినిమాను పట్టాలెక్కిద్దామని మహేష్ అనుకున్నాడు.కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఏకంగా డిసెంబర్‌లోనే మహేష్ షూటింగ్‌కు వెళ్లాలని చూస్తున్నాడు.

దీంతో మిగతా నటీనటులతో షూటింగ్ పనులు నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట చిత్రం అసలు షూటింగ్ ఇప్పట్లో జరుపుకుంటుందా లేదా అనే సందేహం సర్వత్రా నెలకొంది.

ఇక ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండగా ఇందులో మహేష్ ఓ అదిరిపోయే లుక్‌లో కనిపిస్తాడు.కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube