సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ను అందుకుంది.
ఇక ఈ సినిమా ఇచ్చిన జోష్తో తన నెక్ట్స్ మూవీని ఇటీవల అనౌన్స్ చేశాడు.ఈ సినిమాకు ‘సర్కారు వారి పాట’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా, ఇటీవల ఈ సినిమా ప్రీలుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా దానికి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.
ఇక ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్లో మనకు కనిపిస్తాడని చిత్ర ప్రీలుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది.కాగా ఈ సినిమా పూర్తిగా ఆర్థిక నేరాల చుట్టూ తిరుగుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
కాగా ఈ సినిమాలో మహేష్ బాబును ఢీకొట్టేందుకు చాలా పవర్ఫుల్ విలన్ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.ఈ క్రమంలోనే కన్నడ నటులు కిచ్చా సుదీప్, ఉపేంద్రల పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ సినిమాలో తాను నటించడం లేదని ఉపేంద్ర ఇటీవల ప్రకటించాడు.తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన ఉపేంద్ర ఆ తరువాత తెలుగులో నటించలేదు.
కాగా ఈ సినిమాలో కిచ్చా సుదీప్ ఖచ్చితంగా నటిస్తాడని అందరూ అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మహేష్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.