సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా “సర్కారు వారి పాట” చిత్రంలో నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది.
షూటింగ్ పనులలో శరవేగంగా జరుపుకుని ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం భావించినట్లు ఇదివరకే ప్రకటించారు.తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ కి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.థియేటర్లో విడుదల తర్వాత ఈ సినిమా ఓటిటి సంస్థ అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుందనే వార్తలు పెద్దఎత్తున హల్చల్ చేస్తున్నాయి.
ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పెద్ద మొత్తంలోనే డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మరి సర్కారు వారి పాట చిత్రం డిజిటల్ రైట్స్ గురించి సదరు సమస్థ అధికారిక ప్రకటన తెలియజేయాల్సి ఉంది.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే బ్యాంక్ లో జరిగిన కుంభకోణంలో నిందితులను పట్టుకుని తన తండ్రిని ఎలా కాపాడాడు అనే కథాంశంతో తెరకెక్కబోతుంది.ఈ సినిమా తరువాత మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.
ఈ సినిమాను ఇదివరకే అధికారికంగా ప్రకటించినప్పటికీ సర్కారు వారి పాట చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారు.