టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన రీసెంట్ మూవీ సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ కెరీర్లో మరో బ్లాక్బస్టర్ మూవీగా నిలిచింది.
ఈ సినిమా అందించిన జోరుతో మహేష్ తన కొత్త సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే గీతాగోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్లో తన కొత్త సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన మహేష్, ఈ సినిమాను మే 31న ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.
కాగా ఈ సినిమాకు ‘సర్కారి వారి పాట’ అనే ఆసక్తికరమైన టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.కథకు ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావించడంతో ఈ టైటిల్ను పెట్టేందుకే చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు.
ఇక ఈ సినిమా కథ భారతదేశ ఆర్ధిక నేరాల చుట్టూ తిరుగుతుందని తెలుస్తోంది.భారత్లో వేల కోట్ల స్కాం చేసి, బ్యాంకులకు పంగనామం పెట్టి పారిపోయిన వారి గురించి ఈ సినిమాలో ప్రస్తావించనున్నారట.
మొత్తానికి మహేష్ బాబు మరోసారి సామాజిక అంశాన్ని టచ్ చేయనుండటంతో అభిమానుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందా, ఇందులో నటీనటులు ఎవరు ఉంటారా? అనే అంశాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.