టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం లాక్డౌన్ సమయాన్ని తన కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు.కాగా లాక్డౌన్ పూర్తి కాగానే తన నెక్ట్స్ మూవీని పట్టాలెక్కించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే గీతాగోవిందం దర్శకుడు పరశురామ్ డైరెక్షన్లో తన సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించిన మహేష్, ఈ సినిమాను మే 31న లాంఛ్ చేయాలని చూస్తున్నాడు.అన్నీ అనుకున్నట్లు కుదిరితే జూన్ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని మహేష్ భావిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి సోషల్ మెసేజ్ సబ్జెక్టుగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
భారత ఆర్ధిక నేరాల బ్యాక్డ్రాప్తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘సర్కారి వారి పాట’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ టైటిల్ దాదాపు ఖాయమని చిత్ర వర్గాల టాక్.దీంతో తన సినిమా ఇంకా ప్రారంభం కాకముందే ఇలా టైటిల్ లీక్ కావడం ఏమిటని మహేష్ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడట.
తన పీఆర్ టీమ్పై మహేష్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది.ఇలాంటి లీకుల విషయం వారందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి మహేష్ తన సినిమాను ప్రారంభించక ముందే ఇలా టైటిల్ లాక్ కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అప్పుడే ఇండస్ట్రీలో చర్చలు సాగుతున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ చేయబోయే పాత్ర, ఇందులోని నటీనటులు ఎవరనే అంశాలపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అనేక గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా టైటిల్ ఎలా లీక్ అయ్యిందనే విషయంపై చిత్ర యూనిట్ ఆరా తీయనున్నట్లు సమాచారం.