సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది.ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది.
ఈ సినిమాతో మహేష్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్నారు.
కాగా ఈ సినిమా ఓవర్సీస్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేదని సినీ వర్గాల టాక్.
ఈ సినిమాతో మహేష్ మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేశారన్నది నిజం.ఈ సినిమాను మాస్ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు.
కాగా ఈ సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బాగానే ఆదరిస్తున్నారు.దీంతో యూఎస్లో ఈ సినిమా $2,004,007 వసూళ్లు సాధించింది.
ఈ సినిమాతో మహేష్ మూడోసారి రెండు మిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరగా, అనిల్ రావిపూడి F2 తరువాత రెండోసారి ఈ క్లబ్లోకి చేరాడు.
అటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా గీతా గోవిందం సినిమా తరువాత ఈ సినిమాతో రెండోసారి ఆ క్లబ్లోకి ఎంటర్ అయ్యింది.అయితే ఈ సినిమా కలెక్షన్లు ప్రస్తుతం బలహీనపడ్డాయని, టోటల్ రన్లో ఈ సినిమా 2.5 మిలియన్ డాలర్ల మార్క్ను చేరుతుందా లేదా అనేది డౌటే అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్.