టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వరస విజయాలతో దూసుకుపోతున్నాడు.‘మహార్షి’ చిత్రం తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రష్మిఖ మందన కథానాయకిగా నటిస్తుంది.ఈ చిత్రంలో మహేష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రం యొక్క షూటింగ్ దాదాపుగా కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లోని మన ఆర్మీ బేస్ క్యాంపు సరిహద్దుల్లో చిత్రీకరించారు.ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మరల చాలకాలం తరువాత ఎంట్రీ ఇస్తుంది.
ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అవ్వుతుండటంతో సినిమా ప్రమోషన్స్ పై చిత్రా బృందం దృష్టి సారించింది.అందుకే ఈ రోజు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నుండి టిజర్ ను విడుదల చెయ్యనున్నారు.దీంతో టిజర్ కోసం మహేష్ అభిమానులు మరియు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ చిత్రా ‘ టిజర్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి.
ఇంతకు ముందు ఏన్నడు చూడని మహేష్ బాబుని చూడొచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి, అలాగే ఫస్ట్ టైం మహేష్ ఆర్మీ ఆఫీసర్ గెట్ అప్ లో తన మ్యానరిజం చుపించాడంట, లవ్ అండ్ ఎమోషన్స్ తో కూడిన టిజర్ విడుదల అవ్వుతుందని వార్తలు వస్తునాయి.
పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాకు మహేష్ అప్పట్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు.ఇప్పుడు తను నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రానికి మహేష్ తన వాయిస్ ఓవర్ ఇచ్చాడని, అది ఈరోజు విడుదల అవ్వుతున్న టిజర్ లో వినవచ్చు అంటూ తాజా సమాచారం.మహేష్ వాయిస్ ఓవర్ తో సినిమా పై అంచనాలను పెంచాడు.
దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు.