మహేష్బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట చిత్రంలో హీరోయిన్గా కియారా అద్వానీ నటించబోతున్నట్లుగా మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.కాని గత కొన్ని రోజులుగా ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ నటించనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈమద్య రెండు మూడు సార్లు జూమ్ యాప్ ద్వారా సాయి మంజ్రేకర్ తో దర్శకుడు పరశురామ్ కథ విషయంలో చర్చలు జరపడంతో పాటు ఆమెను నవంబర్ నుండి డేట్లు కూడా కావాలంటూ అడిగాడట.
ఈ చిత్రంకు సాయి మంజ్రేకర్ను తీసుకోవడంలో నమ్రతది కీలక పాత్ర అంటూ వార్తలు వస్తున్నాయి.
ముంబయికి చెందిన నమ్రతకు సాయి మంజ్రేకర్ కుటుంబ సభ్యులు వరుసకు బంధువులు అవుతారట.ఇరు కుటుంబాల మద్య చాలా కాలంగా మంచి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయనేది టాక్ తాజాగా సాయి మంజ్రేకర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా తల్లిదండ్రులతో నమ్రత చాలా క్లోజ్గా ఉంటుంది అంటూ వ్యాఖ్యలు చేసింది.
మహేష్ బాబు కోసం హీరోయిన్ను వెదుకుతున్న సమయంలో నమ్రత ఈమెను తీసుకోవాల్సిందిగా సలహా ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కథ చర్చలు జరుగుతున్నాయి.ఇక ఈ చిత్రంతో పాటు సాయి మంజ్రేకర్ మెగా హీరో వరుణ్ తేజ్ చిత్రంలో కూడా హీరోయిన్గా నటిస్తోంది.ఈ రెండు సినిమాల తర్వాత టాలీవుడ్లో ఈ అమ్మడు బిజీ అయ్యే అవకాశం ఉందంటున్నారు
.