తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ చిత్రంలో మహానటి మూవీ చిత్రం “కీర్తి సురేష్” హీరోయిన్ గా నటిస్తుండగా గీతా గోవిందం మూవీ ఫేమ్ ప్రముఖ దర్శకుడు “పరశురాం” దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది.కాగా ఈ చిత్రం కోసం మైత్రి మూవీ మేకర్స్ దాదాపుగా 80 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ని వెచ్చిస్తున్నట్లు సమాచారం.
అయితే గత ఏడాదిలో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ పనులు కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ మరియు సినిమా షూటింగులు నిలిపివేయడంతో ఈ చిత్ర షూటింగ్ పనులను కూడా తాత్కాలికంగా కొంత కాలం పాటు వాయిదా వేశారు.
కాగా ప్రస్తుతం కరోనా ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు సర్కారు వారి పాట చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను మళ్లీ మొదలు పెట్టారు.
ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియజేసింది.దీంతో మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం “మైత్రి మూవీ మేకర్స్” సంస్థ టాలీవుడ్ లో పలు భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తోంది.ఇందులో భాగంగా ఇప్పటికే టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప” చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తోంది.కాగా ఈ చిత్ర బడ్జెట్ దాదాపుగా 200 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం దీంతో ఈ చిత్రం ఓవర్సీస్ కలెక్షన్లు 300 కోట్లకు పైగా టార్గెట్ పెట్టుకున్నట్లు టాలీవుడ్ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.