టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.పరశురామ్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట షూటింగ్ ప్రెసెంట్ హైదరాబాద్ లో జరుగుతుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా మహానటి కీర్తి సురేష్ నటిస్తుంది.మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపించ బోతున్నాడని టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించ బోతున్నారని తెలుస్తుంది.అంతేకాదు ఆర్ధిక నేరాలకు పాల్పడే అందరిని టార్గెట్ చేస్తూ ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడట.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ప్రెసెంట్ హైదరాబాద్ లోని ఉప్పల్ మెట్రో స్టేషన్ లో సముద్రఖని, మహేష్ బాబు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలో మహేష్ రెమ్యునరేషన్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కోసం మహేష్ భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఈ సినిమాకు మహేష్ బాబు 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.మొత్తానికి మహేష్ రెమ్యునరేషన్ గురించి మరొకసారి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చ జరుగుతుంది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను 2022 సంక్రాంతి రేస్ లో ఉంచబోతున్నారు.ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇక మహేష్ ఈ సినిమా పూర్తి అవ్వగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా ప్రెసెంట్ ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.