టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో రికార్డ్ క్రియేట్ చేసాడు.ట్విట్టర్ లో అందరికంటే ముందు వరసలో మహేష్ నిలబడ్డాడు.
ప్రస్తుతం మహేష్ బాబు ట్విట్టర్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.ఆయనకు కోటి పద్నాలుగు లక్షల ఫాలోవర్లు కలిగి ఉన్నారు.
అంతేకాదు మహేష్ చేసిన ట్వీట్లు 24 సార్లు 100 కే లైక్స్ ను సంపాదించి నెంబర్ వన్ స్థానంలో మహేష్ నిలిచారు.
తర్వాత స్థానాల్లో ఎన్టీఆర్ ఆరుసార్లు 100 కె లైక్స్ పొంది రెండవ స్థానంలో నిలిచాడు.
తర్వాత రానా మూడుసార్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు.ఈ విషయంలో మిగతా హీరోలు ఎవ్వరు మహేష్ బాబును బీట్ చెయ్యలేరు.
అంతమంది ఫాలోవర్లను కలిసి టాలీవుడ్ సూపర్ స్టార్ నెంబర్ వన్ స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాను పరశురామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.పరశురామ్ సామజిక అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి చేసుకుంది.అక్కడ భారీ యాక్షన్ సీన్స్ తెరకెక్కించాడు డైరెక్టర్.
రీసెంట్ గా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యి కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమా విడుదల అవ్వకుండానే మహేష్ బాబు త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.
వీరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.అయినా ఈ రెండు సినిమాల్లో మహేష్ లోని మరొక కోణాన్ని బయటకు తీసాడు త్రివిక్రమ్.ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.
ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.