పోస్టుమార్టం: సరిలేరు నీకెవ్వరులో నవ్వులపాలైన సీన్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ ఎంటర్‌టైనర్ సరిలేరు నీకెవ్వరు సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు పాస్ మార్కులు వేశారు.ఈ సినిమాలో కథ రొటీన్ అయినప్పటికీ సినిమాలో కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండటంతో మాస్ ప్రేక్షకులు మాత్రం పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.

 Mahesh Babu Rashmika Anilravipudi Sarileru Neekevvaru-TeluguStop.com

అయితే వారు కూడా కొన్ని సీన్లు చూసి నవ్వుకున్న సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి.అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సరిలేరు నీకెవ్వరు సినిమాలో మొట్టమొదటి అంశం, ట్రెయిన్ సీన్.ఈ సినిమా యూనిట్ మొదట్నుండీ ఈ సినిమాలో ట్రెయిన్ సీన్ 30 నిమిషాలపాటు కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని డప్పు కొట్టాయి.

అయితే కేవలం కామెడీ కోసమే ఆ ట్రెయిన్ ఎపిసోడ్ పెట్టారు.అది కూడా ఏమంత కామెడీని పండించలేకపోయింది.

ఒకటో రెండో సీన్స్ తప్పితే ఈ ట్రెయిన్ సీక్వెన్స్‌లో సాధారణ ప్రేక్షకలు పగలబడి నవ్వే అంశాలు మాత్రం లేవు.దీంతో ఈ సీన్‌పై చిత్ర యూనిట్ క్రియేట్ చేసిన హైప్ నవ్వులపాలైందనే చెప్పాలి.

ఇక రెండో అంశం, ఈ సినిమాలో కృష్ణకు సంబంధించి స్పెషల్ ట్రీట్ ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింద.కానీ కేవలం మొబైల్ ఫోన్‌లో అల్లూరి సీతారామరాజు సీన్ చూపించి కృష్ణ ఫ్యాన్స్‌తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్‌ను ఫూల్స్ చేశారు.

ఈ మాత్రం దానికే కృష్ణగారి పేరు ఇంతలా వాడుకుంటారా అంటూ చిత్ర యూనిట్‌పై నవ్వుతున్నారు ప్రేక్షకులు.

మూడో అంశంగా నిలుస్తుంది మహేష్ చెప్పే ఓ పవర్‌ఫుల్ డైలాగ్.

ప్రకాష్ రాజ్‌తో పాటు పలువురు రాజకీయ నేతలకు మహేష్ వార్నింగ్ ఇచ్చే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టే బడ్జెట్‌కు సంబంధించిన ప్యాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయాలని, అది ప్రజలందరికీ ఇవ్వాలని అంటాడు.అసలు వాస్తవానికి ఏమాత్రం సాధ్యం కానీ అంశాలను ప్రేక్షకుల మెదడులోకి పంపాలని చూసిన దర్శకుడి తెలివికి ప్రేక్షకులు పలుమార్లు నవ్వుకున్నారు.

ఇక చివరగా, మైండ్ బ్లాక్ సినిమాలో మహేష్ డ్యాన్స్ అదరగొట్టాడని, ఆయన లుంగీ డ్యాన్స్‌ సినిమాకే హైలైట్ కానుందని అన్నారు.కానీ మహేష్ లుంగీలో చాలా నీరసంగా కనిపించాడు.

కట్టెపుల్లలాంటి కాళ్లతో లుంగీ డ్యాన్స్ చేసిన మహేష్‌ను చూసి యాంటీ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మహేష్ ఫ్యాన్స్ కూడా నవ్వుకున్నారు.అంటే ఇక్కడ కూడా చిత్ర యూనిట్ ప్లాన్ వర్కవుట్ కాలేదు.

మొత్తానికి సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్, పలు అంశాలపై ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించడంతో థియేటర్లో జనాలు నవ్వుకుంటున్నారు.ఏదేమైనా అటు సినిమా పరువుతో పాటు మహేష్ బాబు పరువును కూడా చిత్ర యూనిట్ తీశారంటూ పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube